ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- August 01, 2026
కువైట్ : కువైట్లోని ఫర్వానియా ప్రాంతంలో నిర్వహించిన ఆహార భద్రత తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఈ సందర్భంగా 195.2 కిలోల కల్తీ, వినియోగానికి అనర్హమైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) ఆధ్వర్యంలో ఫర్వానియా ఫుడ్ ఇన్స్పెక్షన్ కంట్రోల్ విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో కల్తీ ఆహారాన్ని విక్రయించినందుకు ఒక కేసు నమోదు చేయగా, చెల్లుబాటు అయ్యే హెల్త్ సర్టిఫికెట్లు లేకుండా ఆహారాన్ని నిర్వహించిన ఇద్దరు కార్మికులకు సంబంధించి రెండు ఉల్లంఘనలు నమోదు చేశారు.
అదేవిధంగా, అవసరమైన హెల్త్ సర్టిఫికేట్ లేని ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్న యజమానిపై కూడా మరో ఉల్లంఘన నమోదు చేశారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న 195.2 కిలోల మాంసం మానవ వినియోగానికి పూర్తిగా అనర్హమని నిర్ధారించిన అధికారులు, చట్టపరమైన నిబంధనల ప్రకారం దానిని పూర్తిగా ధ్వంసం చేశారు.
ఆహార భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్న అధికారులు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే ఆహార సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







