'వెక్కిరింత' చిత్ర ఆడియో వేడుక...
- August 15, 2016
కాకర్ల, నాని (శ్రీధర్), వినీత్, ప్రేయసినాయక్, మౌనికరెడ్డి ప్రధాన తారలుగా తెరకెక్కుతున్న చిత్రం 'వెక్కిరింత'. శ్రీ లాస్య క్రియేషన్స్ పతాకంపై జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించిన చిత్రమిది. చంద్రలేఖ, భానుప్రసాద్.జె. సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్లో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయివెంకట్, మహిత్ నారాయణ్, ఖుద్దూస్, బల్లేపల్లి మోహన్, సింహా తదితరులు మాట్లాడుతూ, "ఈ ఏడాది చిన్న చిత్రాలకు చక్కటి ఆదరణ లభిస్తోంది. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలి" అని ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు నాగబాబు మాట్లాడుతూ, "నిర్మాతలు ముగ్గురూ త్రిమూర్తుల్లాగా వారు అండగా నిలవడంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తిచేయగలిగాను. సినిమా బాగా వచ్చింది. వీనులవిందైన సంగీతం కుదిరింది" అని అన్నారు. కాకర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, "ప్రతిభ కలిగిన సాంకేతిక నిపుణులు, నటీనటులు ఈ చిత్రానికి పనిచేశారు. ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి" అని అన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు సంగీత దర్శకులు చంద్రలేఖ, భానుప్రసాద్లు కృతజ్ఞతలను తెలియజేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







