భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- August 06, 2026
దుబాయ్: ఆస్టర్ డీఎం హెల్త్కేర్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్, దుబాయ్లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ. విష్ణువర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భారత్–యూఏఈ మధ్య సుదీర్ఘ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరువురు చర్చించారు.
భేటీ అనంతరం డాక్టర్ ఆజాద్ మూఫెన్ మాట్లాడుతూ, నూతన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ. విష్ణువర్ధన్ రెడ్డిని స్వాగతించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజాసేవ, దౌత్యరంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలు భారత్ ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొనియాడారు.
భారత కాన్సులేట్తో కలిసి భారత్–యూఏఈ సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని డాక్టర్ మూఫెన్ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సేవలు, సమాజ సంక్షేమం, యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసుల సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో కలిసి పనిచేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఈ సమావేశం ద్వారా దౌత్య సంస్థలు, ప్రముఖ ఆరోగ్య సంస్థల మధ్య సహకారాన్ని మరింత విస్తరించి, నాణ్యమైన వైద్య సేవలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, భారతీయ ప్రవాసుల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉమ్మడి సంకల్పం వ్యక్తమైనట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







