రేపు రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు
- July 28, 2015
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ మృతిపట్ల కేంద్ర కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. కలాం సేవలను కొనియాడుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. రేపు రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు జరగనున్నట్లు కేబినెట్ తెలిపింది. కలాం మృతికి 7 రోజులు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని రాజాజీమార్గ్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి కలాం పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తరువాత భౌతికకాయాన్ని ఆయన జన్మస్థలం రామేశ్వరానికి తరలిస్తామని కేంద్రమంత్రి రూడీ తెలిపారు. అంతకుముందు బీజేపీ పార్లమెంట్ సమావేశంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. కలాం మరణంతో భారతదేశం తన రత్నాన్ని కోల్పోయిందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అబ్దుల్ కలాం ముందు దేశానికి భారతరత్నమని ఆ తరువాతే రాష్ట్రపతి అయ్యారని ప్రధాని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









