వీధుల్లో వేధింపులపై అల్ ఖువాయిర్ నివాసితుల ఫిర్యాదు
- August 15, 2016
32 ఏళ్ళ మహిళ ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారు. వాహనాల్లో నెమ్మదిగా వస్తూ, 'రేటెంత' అని అడుగుతుండడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు అల్ ఖువాయిర్ ప్రాంతంలో నిత్యకృత్యమైపోయాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 14 నుంచి 15 ఏళ్ళలోపు యువకులు ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు తనిఖీలు నిర్వహిస్తున్నా, చాలా సందర్భాల్లో యువత తప్పించుకుంటున్నారనీ, 14 నుంచి 15 ఏళ్ళ లోపు వారే కావడంతో వారి పట్ల ఎవరికీ అనుమానం రావడంలేదని బాధితులు వాపోయారు. పోలీసులకు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







