డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!
- August 07, 2026
మనామా: డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాతో సంబంధాలు పెట్టుకుని మాదకద్రవ్యాల పంపిణీలో పాల్గొన్నాడనే ఆరోపణలపై ఓ టేలర్ పై బహ్రెయిన్ హై క్రిమినల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆగస్టు 11న తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు ప్రకటించింది.
పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు, ఓ ప్రాంతంలో 'డెడ్ డ్రాప్' పద్ధతిలో మాదకద్రవ్యాలను దాచిపెట్టి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో భద్రతా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సాయంత్రం సమయంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ రోడ్డుపక్కన ఓ వస్తువును దాచేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతడు దాచిన గాజు సీసాలో సుమారు 41.70 గ్రాముల ద్రవరూప మాదకద్రవ్యం లభించింది.
అనంతరం నిందితుడి వద్ద నిర్వహించిన తనిఖీలో అదే తరహా ద్రవరూప మాదకద్రవ్యంతో నింపిన 29 కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం బరువు 413.52 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దర్యాప్తులో ఈ కేసు బహ్రెయిన్లోకి మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను అక్రమంగా తరలించి విక్రయించే సంఘటిత ముఠాతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. నిందితుడు డ్రగ్స్ను స్వీకరించడం, నిల్వ చేయడం, చిన్న చిన్న భాగాలుగా విభజించి డబ్బు కోసం పంపిణీ చేయడం వంటి బాధ్యతలు నిర్వహించినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!
- మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన న్యూమెక్సికో కోర్టు
- హౌతీ దాడుల్లో నజ్రాన్లో 11 మంది పౌరులకు గాయాలు..!!
- ధోఫార్లో ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అవగాహన ప్రచారం ప్రారంభం..!!
- ఫోర్బ్స్ టాప్-100 సీఈఓల జాబితాలో ఖతార్ కార్పొరేట్ దిగ్గజాలు వీరే..!!
- డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో టేలర్ పై విచారణ..!!
- 5 మిలియన్ డాలర్ల మానవతా సాయం ప్రకటించిన కువైట్..!!
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం







