కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- August 08, 2026
న్యూఢిల్లీ: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షాను న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఆగస్టు 6న కలిసినట్లు సంబంధిత ప్రతినిధి తెలిపారు.
ఈ సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్–గాంధీనగర్ మధ్య చంద్రఖేడా ప్రాంతంలో నిర్మించనున్న ప్రతిష్టాత్మక షాపింగ్ మాల్ ప్రాజెక్టు గురించి అమిత్ షాకు వివరించారు. ప్రాజెక్టు ప్రణాళిక, అభివృద్ధి అంశాలతో పాటు దాని పురోగతికి సంబంధించిన వివరాలను ఆయనకు సమగ్రంగా వివరించినట్లు తెలిపారు.
చంద్రఖేడా ప్రాంతంలో చేపట్టనున్న ఈ షాపింగ్ మాల్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాన్ని అందిస్తానని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రాజెక్టు విషయంలో విలువైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మద్దతుతో ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!







