ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- August 09, 2026
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి మాత్రం మధ్యవర్తుల ద్వారా కొనసాగుతోందని ఆయన తెలిపారు.
అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపై స్పందించిన అరాఘ్చీ..మధ్యవర్తుల ద్వారా సందేశాలను పంపుకోవడం, వాటికి సమాధానాలు ఇవ్వడం చర్చలు లేదా చర్చల ప్రక్రియగా పరిగణించలేమని పేర్కొన్నారు.
ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరపాలనే ఉద్దేశంతో లేదని కూడా ఆయన వెల్లడించినట్లు రాయిటర్స్ తెలిపింది.
అయితే, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్య మార్గాల ద్వారా సందేశాల మార్పిడి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్–అమెరికా మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో అరాఘ్చీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- బోనమెత్తిన హైదరాబాద్
- వాహనదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- సైబరాబాద్లో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 311 మంది పై కేసులు
- ఇరాన్–అమెరికా మధ్య చర్చలు లేవు: విదేశాంగ మంత్రి అరాఘ్చీ
- భారత చేనేత వారసత్వానికి అంకితంగా ‘జాతీయ చేనేత సమ్మేళనం–2026’
- 4వ బెటాలియన్ను సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఖతార్లో నియంత్రిత మందులు తీసుకెళ్లే ప్రయాణికులకు కొత్త ఈ-పర్మిట్ విధానం
- ఏపీలో రూ.3,400 కోట్లతో జలధార జలహరతి పథకం
- సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!
- కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలో ఆన్లైన్ వేధింపులపై చర్చ..!!







