1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!
- August 10, 2026
న్యూ ఢిల్లీ: మొబైల్ వినియోగదారులకు వచ్చే సర్వీస్, లావాదేవీల కాల్స్ను సులభంగా గుర్తించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-బ్యాంకింగ్ సంస్థల కోసం ప్రత్యేకంగా 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ (TRAI) చేసింది.ఈ విధానం ద్వారా సంస్థల నుంచి వచ్చే నిజమైన కాల్స్ను, అనుమానాస్పద కాల్స్ను వినియోగదారులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.
యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోని సంస్థలకు:
తొలి దశలో యుటిలిటీస్, కొరియర్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లోని సంస్థలకు ఈ 1601 సిరీస్ను వర్తింపజేయనున్నారు. ఆయా రంగాలకు చెందిన అర్హత కలిగిన సంస్థలు తమ కస్టమర్లకు సేవలు, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ చేసేందుకు ఈ సిరీస్ నంబర్లను ఉపయోగించుకోవచ్చు. అయితే, 1601 సిరీస్ నంబర్లను అన్ని సంస్థలకు నేరుగా కేటాయించరు. టెలికాం ఆపరేటర్లు ముందుగా సంస్థల వివరాలను వెరిఫై చేస్తారు. నిర్దేశిత నిబంధనలను పాటిస్తూ అర్హత సాధించిన సంస్థలకు మాత్రమే ఈ సిరీస్ నంబర్లను కేటాయిస్తారు. దీంతో ఈ నంబర్ల వినియోగంలో పారదర్శకతతో పాటు భద్రత కూడా పెరుగుతుందని ట్రాయ్ భావిస్తోంది.
ప్రస్తుతం సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ను వినియోగదారులు తరచూ అనుమానంతో చూడాల్సి వస్తోంది. కొంతమంది వ్యక్తులు, మోసగాళ్లు సాధారణ ఫోన్ నంబర్లను ఉపయోగించి బ్యాంకింగ్, సర్వీస్ లేదా ఇతర సంస్థల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 1601 సిరీస్ ద్వారా సంస్థల అధికారిక సర్వీస్, లావాదేవీల కాల్స్కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. సాధారణ 10 అంకెల నంబర్లతో మోసాలకు పాల్పడే వారిని అడ్డుకోవడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ట్రాయ్ పేర్కొంది. మొత్తంగా, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు టెలికాం రంగంలో సురక్షితమైన కమ్యూనికేషన్కు ఈ నిర్ణయం దోహదపడనుంది.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







