బహ్రెయిన్ లో అక్రమ నర్సరీల మూసివేత
- July 28, 2015
విద్యాశాఖ అధికారులు జరిపిన సాధారణ తనిఖీలలో బహ్రెయిన్ లో లైసెన్స్ లేకుండా నడపబడుతున్న మనామా లోని అల్ ఆలెమ్ అల్ శాఘీర్ కిండర్ గార్టన్ , అల్ దూరాజ్ లోని అల్ సీఫ్ కిండర్ గార్టన్ ఇంకా మెక్ షా లోని అల్ మసాహెల్ కిండర్ గార్టన్ నర్సరీలను అధికారులు మూసివేశారు; యజమానులను బహిరంగ విచారణకు తరలించారు. గత సంవత్సరం ఏప్రిల్ లో బహ్రెయిన్ నర్సరీ విధానంపై ఆరోపణలు వచ్చిన కారణంగా MPలు జరిపిన విచారణలో, హిద్ద్ లోని ఒక నర్సరీలో పిల్లలను కుర్చీలకు కట్టడo, మంచినీరు కూడా తాగడానికి అనుమతించకపోవడం, ఇళ్లకు గాయాలతో రావడం వంటి భయంకర వేధింపుల చర్యలు వెలుగులోకి రావడంతో కమిటీ వారు నర్సరీల ప్రామాణికతను పెంచే సత్వర చర్యలకు ఆదేశాలిచ్చిన సంగతి విదితమే.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







