బియ్యప్పిండి రొట్టెలు
- July 28, 2015
ఈ రోజు మరో పసందైన రొట్టెలతో మీ ముందుకు వచ్చాం... అవే బియ్యప్పిండి రొట్టెలు!!
కావలసిన పదార్ధాలు:
- బియ్యప్పిండి - 4 కప్పులు
- పల్లీల పొడి (వేయించిన పల్లీల తో ) - 1 కప్పు
- పచ్చిమిర్చి పేస్టు - 1 టీ స్పూను
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
- కీరా దోసకాయ తురుము - 1/2 కప్పు
- కారత్ తురుము - 1/2 కప్పు
- కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
- మెంతికూర తురుము - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - చిటికెడు
- ఉప్పు - తగినంత
తయారు చేయు విధానం:
- ముందుగా ఒక పెదా బౌల్ లో బియ్యప్పిండి, పల్లీల పొడి, ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు తురిమి పెట్టుకున్న కీరా దోసకాయ, కారట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, మెంతి కూర, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు వేసి గోరువెచ్చని నీటిని పోస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలపండి.
- ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోండి.
- ఒక అలుమీనియం ఫాయిల్ మీద చేతికి కాస్త నూనె రాసుకొని ఈ ముద్దల్ని అద్దండి.
- ఇప్పుడు ఒక పెనం మీద ఈ రొట్టె ను కాల్చండి. ఒక పక్క వేయించాక, ఆ ఫాయిల్ మెల్లిగా పైకి వచ్చేస్తుంది.
- అప్పుడు మరో పక్క కూడా కాస్త నూనె వేసి కాల్చండి.
- అంతే ఎంతో రుచికరమైన బియ్యప్పిండి రొట్టెలు తినటానికి రెడీ..!! వీటిని పెరుగుతో మరియు ఏదైనా పచ్చడితో తినచ్చు.
---- శ్రీమతి వేదా, దుబాయ్, యు.ఏ.ఈ.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







