తెలంగాణాలో పెరగనున్న మెడికల్ సీట్లు
- August 16, 2016
తెలంగాణ విద్యార్థులకు శుభవార్త... మెడికల్ సీట్లు పెరగనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణలో మరో మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఎంసెట్-2 లీకేజీతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు తీపికబురందింది. అదనంగా మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దేశ వ్యాప్తంగా 26 మెడికల్ కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. వాటిలో మూడు తెలంగాణ విద్యా సంస్థలకు అనుమతి ఇచ్చింది. మెదక్ జిల్లా ములుగూరు మండలంలోని ఆర్వీఎం మెడికల్ కాలేజీ, రంగారెడ్డి జిల్లాలోని మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పటాన్చెరులోని మహేశ్వరా మెడికల్ సైన్సెస్కు కొత్తగా అనుమతులు రాబోతున్నాయి. వీటిలో ఒక్కొక్కదానికి 150 సీట్లు చొప్పున 450 సీట్లు భర్తీ చేసుకోవచ్చు. ఇందులో 50 శాతం కన్వీనర్ కోటాకిందకు వస్తాయి. ఈ కళాశాలలకు సంబంధించిన తనికీ సెప్టెంబర్లో జరగనుంది. కొత్త సీట్ల రాకతో తెలంగాణలోని సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో వెయ్యి, ఈఎస్ఐ 60, ప్రైవేట్ రంగలో 2,350 సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. వీటి కౌన్సెలింగ్ ఎంసెట్-3, నీట్-2 ఆధారంగా చేస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







