అబుదాబి షాపింగ్ సెంటర్లో లులు గ్రూప్ ఉద్యోగులతో UAE అధ్యక్షుడి భేటీ
- August 12, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబిలోని ఓ షాపింగ్ సెంటర్ను సందర్శించి లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ఎంఏ యూసుఫలితో పాటు పలువురు ఉద్యోగులను కలిశారు.
ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు లులు గ్రూప్కు చెందిన వివిధ విభాగాలను సందర్శించారు. యూసుఫలి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు. షాపింగ్ సెంటర్లోని ఉద్యోగులు, వినియోగదారులతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు.
యూఏఈ సమాజానికి సేవలందించడంలో లులు గ్రూప్ చేస్తున్న కృషి, చేపడుతున్న పలు కార్యక్రమాలను షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగిస్తున్న లులు గ్రూప్ సేవలను ఆయన అభినందించారు.
అనంతరం ఉద్యోగులు, షాపింగ్ సెంటర్కు వచ్చిన వినియోగదారులు యూఏఈ అధ్యక్షుడితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఆయనను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లభించడం పట్ల ఉద్యోగులు, సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అబుదాబి షాపింగ్ సెంటర్లో లులు గ్రూప్ ఉద్యోగులతో UAE అధ్యక్షుడి భేటీ
- సౌదీ అరేబియాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన విపుల్
- డా.ఈష్ సింఘాల్కు ఘన వీడ్కోలు.. కతార్లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..







