చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక

- August 18, 2026 , by Maagulf
చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక

న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలోచిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM)లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అనుమతిస్తే ఐటీ చట్టంలోనిసెక్షన్ 79 ప్రకారం లభించే ‘సేఫ్ హార్బర్’ రక్షణను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY)స్పష్టం చేసింది. ప్లాట్‌ఫామ్‌లపై అభ్యంతరకర కంటెంట్‌ను అరికట్టడంలో విఫలమైతే చట్టపరమైన మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పింది. భారతదేశంలోని విభిన్న భాషలు, సామాజిక మరియు సాంస్కృతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంటెంట్ మోడరేషన్ వ్యవస్థలను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా డీప్‌ఫేక్ ద్వారా సృష్టించిన కంటెంట్‌ను వినియోగదారులు సులభంగా గుర్తించేలా తప్పనిసరిగా లేబుల్ చేయాలని అధికారులు సూచించారు.

దేశీయ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందే
వాక్ స్వాతంత్య్రం ముఖ్యమైనదే అయినప్పటికీ, దేశంలో పనిచేసే ప్రతీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్థానిక చట్టాలు, నిబంధనలకు కట్టుబడి తీరాల్సిందేనని ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ‘X’ (గతంలో ట్విట్టర్) అకౌంట్ల నిలిపివేతపై తెచ్చిన పారదర్శకత నిబంధనల నేపథ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com