‘గీతాంజలి’ 4Kలో ఆగస్టు 28న వరల్డ్వైడ్ రీ-రిలీజ్
- August 19, 2026
కింగ్ నాగార్జున, మణిరత్నం ఆల్ టైం క్లాసిక్ ‘గీతాంజలి’ నాగార్జున బర్త్డే సందర్భంగా తెలుగు, తమిళంలో బూర్లె శివ ప్రసాద్ శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా 4Kలో ఆగస్టు 28న వరల్డ్వైడ్ రీ-రిలీజ్
కింగ్ నాగార్జున ఎవర్గ్రీన్ క్లాసిక్స్లో ఒకటి' గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్ను చూపించడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 28న నాగార్జున బర్త్డే సందర్భంగా ‘గీతాంజలి’ తెలుగు, తమిళ భాషల్లో 4K ఫార్మాట్లో ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్గా, ఎమోషనల్గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మణిరత్నం తనదైన స్టోరీటెల్లింగ్తో ఈ ప్రేమకథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచి ‘గీతాంజలి’ని క్లాసిక్గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్గా నటించారు.
ఈసారి 4K ఫార్మాట్లో ‘గీతాంజలి’ని చూడటం ఈ రీ-రిలీజ్లో ప్రధాన ఆకర్షణ కానుంది. మరింత క్లారిటీ, డీటెయిలింగ్తో విజువల్స్ను ప్రేక్షకులు కొత్త అనుభూతితో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. అప్పట్లో థియేటర్లలో ‘గీతాంజలి’ని చూసిన వారికి ఇది మరోసారి ఆ రోజులను గుర్తుచేసే నాస్టాల్జిక్ జర్నీ కానుంది. ఇక ఈ సినిమాను థియేటర్లలో చూడని నేటి జనరేషన్కు మాత్రం ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్ను బిగ్ స్క్రీన్పై ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం దక్కనుంది. ఆగస్టు 28న 4Kలో ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో మ్యాజిక్ క్రియేట్ చేయనుంది.
తాజా వార్తలు
- ఫ్లయింగ్ కారు రవికి కేంద్ర మంత్రి సపోర్ట్..!
- ఇరాన్ నుంచి యూఏఈ వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు..
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!
- చట్టాల ఉల్లంఘన పై మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరిక
- ఖతార్లో కస్టమ్స్ సేవల మెరుగుదలకు ‘షారెక్’లో సర్వే..!!







