కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- August 20, 2026
కువైట్: కువైట్లో కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు కొరడా ఝళిపించారు. షుబ్రా అల్-జలీబ్ మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో 100 కిలోల గుర్తుతెలియని మీట్ ను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై 8 కేసులు నమోదు చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు తెలిపారు.
అథారిటీకి చెందిన ఇన్స్పెక్షన్ విభాగం అధికారులు షుబ్రా అల్-జలీబ్ ప్రాంతంలోని ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినందుకు 4 కేసులు, అలాగే మూలం, వివరాలు తెలియని సుమారు 100 కిలోల మాంసాన్ని ధ్వంసం చేసినందుకు మరో 4 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
కువైట్లోని వివిధ గవర్నరేట్లలో ఆహార సంస్థలు, ఆహార కార్యకలాపాలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటం, మార్కెట్లలో విక్రయించే ఆహార పదార్థాల భద్రత, నాణ్యతను నిర్ధారించడమే ఈ తనిఖీల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







