అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- August 20, 2026
మనామా: బహ్రెయిన్లోని అల్ రమ్లీ ప్రాంతంలో ఆగస్టు 18న జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ నుంచి సమాచారం అందిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రారంభించినట్లు నార్తర్న్ గవర్నరేట్ చీఫ్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఘటనా స్థలంలో క్రైమ్ సీన్ నిపుణులు, ఫోరెన్సిక్ వైద్యుడితో సాంకేతిక, వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో ఊపిరాడకపోవడం వల్లే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ప్రాసిక్యూటర్లు అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ను పరిశీలించి అవసరమైన ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాలను సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో పరీక్షించారు. వైద్య, న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, అగ్నిప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించేందుకు సివిల్ డిఫెన్స్ అధికారులు సాంకేతిక నివేదికను సిద్ధం చేయనున్నారు. దర్యాప్తు అధికారులు అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేయాలని ఆదేశించారు.
దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ను అధికారులు తమ ఆధీనంలో ఉంచారు. మంటలు ఎలా చెలరేగాయి, ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, అగ్నిప్రమాదానికి అసలు కారణం ఏంటనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశాల మేరకు సీనియర్ అధికారులు భవనాన్ని పరిశీలించారు. ఘటనపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తు, సాంకేతిక మరియు వైద్య నివేదికల్లో వెలుగుచూసే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







