హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం

- August 24, 2026 , by Maagulf
హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం

హైదరాబాద్: ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు.

డా. శ్రీనివాస్ రావు కావేటి స్థాపించిన కావేటి ఇంటర్నేషనల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అంతర్జాతీయ న్యాయ సేవల కేంద్రంగా పనిచేయనుంది. భారత్‌లోని క్లయింట్లను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న న్యాయ నిపుణులతో అనుసంధానించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

అంతర్జాతీయ న్యాయ వ్యవహారాల్లో వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించేందుకు సంస్థ ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది. ముఖ్యంగా న్యాయ పరిశోధన, పత్రాల విశ్లేషణ, సరిహద్దులు దాటి కొనసాగే కేసులకు సంబంధించిన సహాయం వంటి అంశాల్లో AI సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

భారత్‌లోని వ్యక్తులు, సంస్థలకు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలు, నిపుణుల సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సాంకేతికతను న్యాయ రంగంతో అనుసంధానించడం ద్వారా మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

AI వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో న్యాయ రంగంలో సాంకేతికతను బాధ్యతాయుతంగా, నైతిక ప్రమాణాలతో ఉపయోగించడం ద్వారా క్లయింట్లకు మెరుగైన న్యాయ సహాయం అందించేందుకు కావేటి ఇంటర్నేషనల్ కృషి చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com