చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి

- August 26, 2026 , by Maagulf
చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి

చెన్నై: మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చెన్నైలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) చైర్మన్, మంగళూరు రిఫైనరీ మేనేజింగ్ డైరెక్టర్ (MD)తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెట్రోలియం రంగానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.దేశంలోని చమురు శుద్ధి పరిశ్రమ, పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, సంస్థల పనితీరు తదితర అంశాలపై అధికారులు కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది.

చెన్నైలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ బాలశౌరి పాల్గొని పెట్రోలియం రంగానికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. సంబంధిత సంస్థల కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలపై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com