విశాఖలో ఏఐజీ హాస్పిటల్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

- August 31, 2026 , by Maagulf
విశాఖలో ఏఐజీ హాస్పిటల్‌ నిర్మాణానికి మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో మరొక నూతన అధ్యాయం మొదలైంది. ఆసియాలోనే అత్యున్నత వైద్య సేవలకు ప్రసిద్ధి చెందిన ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఇకపై పారిశ్రామిక నగరమైన విశాఖపట్నంలో కొలువుదీరనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ అత్యాధునిక మెగా హాస్పిటల్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. విశాఖ ఆనందపురం మండలం ఎండాడ ప్రాంతంలో ఏఐజీ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి ఈ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

భారీ పెట్టుబడితో 9,000 ఉపాధి అవకాశాలు
విశాఖలో రూపుదిద్దుకోనున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం ఏఐజీ యాజమాన్యం వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ. 2,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వెయ్యి పడకల సామర్థ్యంతో ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా మారుతుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 9,000 మందికి నూతన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఈ ఆసుపత్రి ఎంతగానో దోహదపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com