అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- August 31, 2026
అబుదాబి: అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణులతో దాడి జరిగినట్లు మీడియాలో వస్తున్న వార్తలను యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
ఎలాంటి ముప్పు ఎదురైనా సమర్థంగా స్పందించేందుకు యూఏఈ సాయుధ దళాలు అత్యంత అప్రమత్త స్థితిలో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశ సార్వభౌమత్వం, భద్రత, స్థిరత్వాన్ని కాపాడే విధంగా అవసరమైన చర్యలు తీసుకునేందుకు సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
ప్రజలు సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది. పుకార్లు, నిర్ధారణ కాని లేదా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా సహా ఇతర మార్గాల్లో ప్రచారం చేయవద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







