సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- September 02, 2026
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై గత ఆగస్టు నెలలో మొత్తం 108 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక సంస్థ నజాహా (Nazaha) వెల్లడించింది. అరెస్టయిన వారిలో కొందరిని అనంతరం బెయిల్పై విడుదల చేసినట్లు తెలిపింది. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను పెంపొందించడం, అవినీతిని అరికట్టడం లక్ష్యంగా ఆగస్టు నెలలో నజాహా పలు క్రిమినల్, పరిపాలనా కేసులను ప్రారంభించింది.
ఈ నెలలో నజాహా అధికారులు మొత్తం 2,659 తనిఖీలు నిర్వహించారు. అవినీతి కేసుల్లో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 352 మంది ఉద్యోగులపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖలకు చెందిన 108 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన ఉద్యోగులపై లంచం తీసుకోవడం, అధికారిక పదవులను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు నమోదు చేసినట్లు నజాహా పేర్కొంది. ప్రభుత్వ రంగంలో అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని నజాహా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







