పక్షిని 'ఢీ' కొట్టడంతో కతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
- August 19, 2016
దోహా , ఇస్తాంబుల్ : తిమింగలం అంత సైజు ఉన్న పెద్ద విమానం ఓ బుల్లి పిట్ట దెబ్బకు అల్లాడిపోయింది . అర్ధాంతరంగా ఆకాశం నుంచి భూమి మీదకు గజ గజ వణుకుతూ దిగిపోయింది. వివరాలలోనికి వెళితే, కతర్ ఎయిర్వేస్ ప్రయాణీకుల విమానం దాని ఇంజిన్లలో , ఒక దానిలో అగ్ని రాజుకొని ఉందని ఏవియేషన్ అధికారులు మరియు క్యారియర్ తెలిపారు. దీనికి కారణం ఒక అనుమానిత పక్షి ప్రోఫిల్లెర్ ఇంజన్ లోనికి వెళ్లి ఆహుతై ఆపై మంటలు రగిల్చింది. దీనితో భయపడిపోయిన విమాన సిబ్బంది ఇస్తాంబుల్ లోని అతాతుర్క్ విమానాశ్రయం గురువారం అత్యవసరంగా విమానంని దించివేయాల్సివచ్చింది.
దోహా కు ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు మరియు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కతార్ ఎయిర్వేస్ అధికారులు తెలిపారు. దోహా నుండి బుదపేస్ట్ వెళుతున్న క్యూ ఆర్ 240 విమానం 298 మంది ప్రయాణికులు మరియు 14 మంది సిబ్బందితో సహా ఇస్తాంబుల్ లోని అతాతుర్క్ విమానాశ్రాయంలో సురక్షితంగా ల్యాండ్ కాబడినట్లు నిర్ధారిస్తూ కతర్ ఎయిర్వేస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







