బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖాలెద్‌ భేటీ

- September 12, 2026 , by Maagulf
బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖాలెద్‌ భేటీ

న్యూఢిల్లీ: అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖాలెద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌.. ఇరాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మసౌద్‌ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. భారత్‌లోని న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడితో కలిసి పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై షేక్‌ ఖాలెద్‌ చర్చించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, పరిస్థితులను మరింత అదుపులోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని ఇరువురు నేతలు నొక్కిచెప్పారు.

అదేవిధంగా ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయడం, శాంతి, అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రాంత ప్రజలకు ప్రయోజనం కల్పించాల్సిన ప్రాధాన్యతను వారు పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com