టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి ...
- August 20, 2016
టర్కీలో ఓ వివాహ వేడుకపై బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడిలో దాదాపు 30 మంది మృతి చెందగా, 94 మందికి గాయాలయ్యాయి. టర్కీలోని ఘజియాన్టేప్ నగరంలో శనివారం అర్ధరాత్రి ఈ బాంబు దాడి చోటుచేసుకుంది. ఈ దాడిని ఆత్మాహుతి దాడిగా డిప్యూటీ ప్రధాని మెహ్మత్ సిమ్సెక్, టర్కీ ప్రభుత్వం భావిస్తోంది. కుర్దిష్ తిరుగుబాటుదారులు లేక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల పని అయి ఉండవచ్చునని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబు దాడిలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.గత ఏడాది కూడా కుర్దిష్ తిరుగుబాటుదారుల దాడులతో టర్కీ వణికిపోయిన సంగతి తెలిసిందే.గత జూన్లో ఐఎస్ ఉగ్రవాదులు ఇస్తాంబుల్లో ఎయిర్పోర్ట్ వద్ద తుపాకులు, బాంబులతో మారణహోమం సృష్టించి 44 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఘజియాన్టేప్లో బాంబు దాడిన జరిగిన ప్రాంతాన్ని, సరిహద్దు మార్గాలను మూసివేసి.. పోలీసులు ఆయా ప్రాంతాలను మొత్తం తమ అధీనంలోకి తీసుకున్నారు. ఫోరెన్సెక్ బృందం ఘటనా స్థలికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రిస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







