మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..

- September 17, 2026 , by Maagulf
మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..

 మచిలీపట్నం: మచిలీపట్నం జనసేన కార్యాలయంలో ఇంచార్జ్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా బండి రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రధాని కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు, ప్రధాని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు,

కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు అధ్యక్షులు వంపు గడవల చౌదరి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మోడీ ప్రధాని గా ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు ఇటువంటి గొప్ప వ్యక్తి దేశానికి ప్రధాని కావడం మన అదృష్టం అన్నారు 

గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ మొహ్మద్ బాషీ ప్రధానికి శుభాకాంక్షలు తెలియచేస్తూ మత సామరస్యాలను కాపాడుతూ ప్రధాని దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు 

జిల్లా ప్రధాన కార్యదర్శి గంపల దుర్గా భవాని మాట్లాడుతూ ప్రధాని మోడీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు 

ఈ కార్యక్రమంలో నగర ఉపా అధ్యక్షులు ఎండి సమీర్, పినిశెట్టి వేణు, ఈవన మణిబాబు, ఉచ చంటి,తిరుమలశెట్టి నాగరాజు, కర్రి మహేష్, వడ్డీ చిరంజీవి,పి.కోటి రెడ్డి, కూనపరెడ్డి ప్రసాద్, గంపల కృష్ణ, గంపల భవాని, నరహరశెట్టి రామ్ జ్యోతి, కూనపరెడ్డి సురేష్, పిన్నిశెట్టి కుమారి,తోట రాజేష్,బడే వెంకటేశ్వరరావు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com