ఉజ్జయినీ నగరం నిట మునిగింది...
- August 21, 2016
మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీ నగరం నిట మునిగింది. దేవాలయాలు సయితం నీటిలో మునిగిపోయాయి. త్రిపుర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీలోని సిప్రా నదిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నదీ తీరంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఆలయ గోపురాలు కూడా కనిపించని పరిస్థితి, స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. నగరంలోని చాలా ఆలయాలు మూసివేశారు. మధ్యప్రదేశ్ అంతటా ఇదే పరిస్థితి. వరదలకు ఒక్కరోజే 15 మంది మృతి చెందారు. వరద ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది. మరో 24 గంటలపాటు మధ్యప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.గుణ, ఇండోర్, ఉజ్జయినీ, దేవా, ఛత్రపూర్లలో నిలు నిలిచిపోయింది. వరద బాధితులను ఆదుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









