ఉజ్జయినీ నగరం నిట మునిగింది...
- August 21, 2016
మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీ నగరం నిట మునిగింది. దేవాలయాలు సయితం నీటిలో మునిగిపోయాయి. త్రిపుర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీలోని సిప్రా నదిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నదీ తీరంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఆలయ గోపురాలు కూడా కనిపించని పరిస్థితి, స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. నగరంలోని చాలా ఆలయాలు మూసివేశారు. మధ్యప్రదేశ్ అంతటా ఇదే పరిస్థితి. వరదలకు ఒక్కరోజే 15 మంది మృతి చెందారు. వరద ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది. మరో 24 గంటలపాటు మధ్యప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.గుణ, ఇండోర్, ఉజ్జయినీ, దేవా, ఛత్రపూర్లలో నిలు నిలిచిపోయింది. వరద బాధితులను ఆదుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









