ఉజ్జయినీ నగరం నిట మునిగింది...
- August 21, 2016
మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీ నగరం నిట మునిగింది. దేవాలయాలు సయితం నీటిలో మునిగిపోయాయి. త్రిపుర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీలోని సిప్రా నదిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నదీ తీరంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఆలయ గోపురాలు కూడా కనిపించని పరిస్థితి, స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. నగరంలోని చాలా ఆలయాలు మూసివేశారు. మధ్యప్రదేశ్ అంతటా ఇదే పరిస్థితి. వరదలకు ఒక్కరోజే 15 మంది మృతి చెందారు. వరద ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది. మరో 24 గంటలపాటు మధ్యప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.గుణ, ఇండోర్, ఉజ్జయినీ, దేవా, ఛత్రపూర్లలో నిలు నిలిచిపోయింది. వరద బాధితులను ఆదుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







