జివి మొబైల్స్ రూ.200 కోట్లతో మహారాష్ట్రలో..
- August 21, 2016
స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ జివి మొబైల్స్ రూ.200 కోట్లతో మహారాష్ట్రలోని లోనవాలలో కొత్తగా తయారీ యూనిట్ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలకు దాదాపు ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నెలకొల్పనుంది. ప్రస్తుతం సంస్థ నెలకు 3-3.5 లక్షల ఫీచర్ మొబైళ్లను విక్రయిస్తోంది. దీపావళి లోగా అమ్మకాలు నెలకు 6 లక్షలకు చేరుకుంటాయని సంస్థ భావిస్తోంది. డిమాండ్ ప్రకారం 2017-18 లోగా నెలకు 10 లక్షల వరకు అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే లొనవాలలో రూ.180-200 కోట్లతో తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు సంస్థ సీఈవో పంకజ్ ఆనంద్ తెలిపారు. వినియోగదారులు స్మార్ట్ఫోన్తో పాటు ఒక ఫీచర్ ఫోనును తమ వద్ద ఉంచుకుంటున్నారని దీన్ని బట్టి భవిష్యత్తులో గిరాకీ తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









