జివి మొబైల్స్ రూ.200 కోట్లతో మహారాష్ట్రలో..
- August 21, 2016
స్వదేశీ మొబైల్ తయారీ సంస్థ జివి మొబైల్స్ రూ.200 కోట్లతో మహారాష్ట్రలోని లోనవాలలో కొత్తగా తయారీ యూనిట్ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలకు దాదాపు ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నెలకొల్పనుంది. ప్రస్తుతం సంస్థ నెలకు 3-3.5 లక్షల ఫీచర్ మొబైళ్లను విక్రయిస్తోంది. దీపావళి లోగా అమ్మకాలు నెలకు 6 లక్షలకు చేరుకుంటాయని సంస్థ భావిస్తోంది. డిమాండ్ ప్రకారం 2017-18 లోగా నెలకు 10 లక్షల వరకు అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే లొనవాలలో రూ.180-200 కోట్లతో తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు సంస్థ సీఈవో పంకజ్ ఆనంద్ తెలిపారు. వినియోగదారులు స్మార్ట్ఫోన్తో పాటు ఒక ఫీచర్ ఫోనును తమ వద్ద ఉంచుకుంటున్నారని దీన్ని బట్టి భవిష్యత్తులో గిరాకీ తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







