యాకూబ్ మెమెన్ కు రేపు ఉదయం ఉరిశిక్ష అమలు
- July 29, 2015
ఉరిశిక్ష పడిన యాకూబ్ మెమెన్ మెర్సీ పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారంనాడు కొట్టేసింది. యాకూబ్ మెమెన్ కేసులో న్యాయపరమైన అన్ని ప్రక్రియలను సరిగ్గా పాటించినట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చింది. సాంకేతిక అంశాలను ప్రశ్నించిన మెమెన్ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరోసారి వాదనలు వినాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. న్యాయపరమైన ప్రక్రియలో ఏ విధమైన లోపాలు కూడా జరగలేదని సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ తేల్చి చెప్పింది. మెమెన్ పిటిషన్పై బుధవారం ఉదయం నుంచి సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. యాకూబ్ మెమెన్ క్షమాబిక్ష పిటిషన్ను మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు తోసిపుచ్చారు. దీంతో యాకూబ్ మెమెన్కు ఉరి ఖరారైంది. ఆయనను రేపు (గురువారం) ఉదయం 7 గంటలకు నాగపూర్ జైలులో ఉరి తీయనున్నారు. ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను రద్దు చెయ్యాలని దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం జస్టిస్ ఏఆర్. దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. స్టే విధించడానికి న్యాయమూర్తి దవే నిరాకరించారు. ఉరి శిక్షను అమలు చెయ్యడాన్ని న్యాయమూర్తికురియన్ జోసెఫ్ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయ్యడంతో పిటిషన్ ను అత్యున్నత స్థాయి ధర్మాసనానికి బదలి చేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. అతను సుప్రీం కోర్టులో సమర్పించిన పిటిషన్ మంగళవారం విచారించిన న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారంనాడు అత్యున్నత ధర్మాసనం యాకూబ్ క్యురెటివ్ పిటిషన్ను కొట్టేసింది. ఉరి తీయాలని ముంబైలో ఆందోళన ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్ను ఉరి తీయాలంటూ బుధవారం ముంబైలో ఆందోళన నిర్వహించారు. 1993 నాటి పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయినవారి బంధువులు ఈ ఆందోళన చేపట్టారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ను కలిసి యాకూబ్ మెమెన్కు ఉరి శిక్ష అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనకు శివసేన పార్టీ మద్దతు తెలిపింది. మెమెన్ క్షమాభిక్ష కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాగా, యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్ మళ్లీ రాష్ట్రపతి వద్దకు వెళ్లింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







