ఆర్‌టిఎ బస్సులన్నీ యాక్సిడెంట్‌ ప్రూఫ్‌!

- August 24, 2016 , by Maagulf
ఆర్‌టిఎ బస్సులన్నీ యాక్సిడెంట్‌ ప్రూఫ్‌!
దుబాయ్‌లోని అన్ని పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ బస్సులూ యాంటీ క్రాష్‌ టెక్నాలజీని సంతరించుకోనున్నాయి. వాహన ప్రమాదాల్ని 50 శాతం తగ్గించేలా ట్రయల్‌ ఫేజ్‌ని లక్ష్యంగా పెట్టుకుంది రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ). జూన్‌లో జరిగిన మిడిల్‌ ఈస్ట్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ని గెలుచుకున్న ఆర్‌టిఎ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఇందుకోసం వినియోగించనున్నారు. ఆర్‌టిఎ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీ (పిటిఎ) సిఇఓ అబ్దుల్లా యూసుఫ్‌ అలీ మాట్లాడుతూ, ప్రస్తుత దశలో కొన్ని బస్సులకే ఈ టెక్నాలజీని వాడుతున్నామనీ, ఇంటర్‌సిటీ, అర్బన్‌ బస్సుల్లో ముందుగా ఈ టెక్నాలజీని ఉపయోగించి, ఫలితాలను విశ్లేషించి ఆ తర్వాత అన్ని బస్సుల్లోనూ వినియోగిస్తామన్నారు. మల్టిపుల్‌ సెన్సార్స్‌, అడ్వాన్స్‌డ్‌ కెమెరాలతో ఈ టెక్నాలజీ అనుసంధానమై ఉంటుంది. ఆపరేషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఓసిసి) వీటిని మానిటర్‌ చేస్తుంది. ప్రమాదాల్ని ముందుగా ఊహించి డ్రైవర్‌ని అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. అలాగే, బస్సుని నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ టెక్నాలజీపైనా అవగాహన కల్పిస్తారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com