ఆర్టిఎ బస్సులన్నీ యాక్సిడెంట్ ప్రూఫ్!
- August 24, 2016
దుబాయ్లోని అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులూ యాంటీ క్రాష్ టెక్నాలజీని సంతరించుకోనున్నాయి. వాహన ప్రమాదాల్ని 50 శాతం తగ్గించేలా ట్రయల్ ఫేజ్ని లక్ష్యంగా పెట్టుకుంది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ). జూన్లో జరిగిన మిడిల్ ఈస్ట్ స్మార్ట్ గవర్నమెంట్ అండ్ స్మార్ట్ సిటీస్ ఎక్స్లెన్స్ అవార్డ్ని గెలుచుకున్న ఆర్టిఎ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ఇందుకోసం వినియోగించనున్నారు. ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ (పిటిఎ) సిఇఓ అబ్దుల్లా యూసుఫ్ అలీ మాట్లాడుతూ, ప్రస్తుత దశలో కొన్ని బస్సులకే ఈ టెక్నాలజీని వాడుతున్నామనీ, ఇంటర్సిటీ, అర్బన్ బస్సుల్లో ముందుగా ఈ టెక్నాలజీని ఉపయోగించి, ఫలితాలను విశ్లేషించి ఆ తర్వాత అన్ని బస్సుల్లోనూ వినియోగిస్తామన్నారు. మల్టిపుల్ సెన్సార్స్, అడ్వాన్స్డ్ కెమెరాలతో ఈ టెక్నాలజీ అనుసంధానమై ఉంటుంది. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసిసి) వీటిని మానిటర్ చేస్తుంది. ప్రమాదాల్ని ముందుగా ఊహించి డ్రైవర్ని అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. అలాగే, బస్సుని నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఈ టెక్నాలజీపైనా అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







