టర్కీలో వరుస బాంబు దాడులు హోర్రెత్తుతున్నాయి..
- August 26, 2016
టర్కీలో వరుస బాంబు దాడులు హోర్రెత్తుతున్నాయి. ఆగ్నేయ టర్కీలోని పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఖుర్దీష్ ఉగ్రవాదులు జరిపిన కారుబాంబు దాడిల్లో 9 మంది పోలీసులు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రీకాప్ అక్ డ్యాగ్ తెలిపారు. కానీ మరణాల సంఖ్యపై ఇంకా క్లారిటీ లేదని టర్కీస్ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కుర్దిష్ సిర్ నాక్ ప్రావిన్స్ ప్రాంతంలో పోలీసు ప్రధాన కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది.
పేలుళ్ల ధాటికి పోలీసు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. కుర్దిష్ వర్కర్స్ పార్టీనే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అథారిటీలు అనుమానిస్తున్నాయి.పోలీసులను, మిలటరీ వాహనాలను, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు అధికారులు పేర్కొన్నారు. 12 అంబులెన్స్ లు, రెండు హెలికాప్టర్లను సహాయక చర్యల నేపథ్యంలో దాడి జరిగిన ప్రాంతానికి పంపినట్టు ఆరోగ్య మంత్రి చెప్పారు. కుర్దిష్ వర్కర్స్ పార్టీకి, సెక్యురిటీ ఫోర్స్ లకు మధ్య గతేడాది నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







