టర్కీలో వరుస బాంబు దాడులు హోర్రెత్తుతున్నాయి..
- August 26, 2016
టర్కీలో వరుస బాంబు దాడులు హోర్రెత్తుతున్నాయి. ఆగ్నేయ టర్కీలోని పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఖుర్దీష్ ఉగ్రవాదులు జరిపిన కారుబాంబు దాడిల్లో 9 మంది పోలీసులు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రీకాప్ అక్ డ్యాగ్ తెలిపారు. కానీ మరణాల సంఖ్యపై ఇంకా క్లారిటీ లేదని టర్కీస్ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కుర్దిష్ సిర్ నాక్ ప్రావిన్స్ ప్రాంతంలో పోలీసు ప్రధాన కార్యాలయానికి 50 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది.
పేలుళ్ల ధాటికి పోలీసు కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. కుర్దిష్ వర్కర్స్ పార్టీనే ఈ దాడికి పాల్పడి ఉంటుందని అథారిటీలు అనుమానిస్తున్నాయి.పోలీసులను, మిలటరీ వాహనాలను, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు అధికారులు పేర్కొన్నారు. 12 అంబులెన్స్ లు, రెండు హెలికాప్టర్లను సహాయక చర్యల నేపథ్యంలో దాడి జరిగిన ప్రాంతానికి పంపినట్టు ఆరోగ్య మంత్రి చెప్పారు. కుర్దిష్ వర్కర్స్ పార్టీకి, సెక్యురిటీ ఫోర్స్ లకు మధ్య గతేడాది నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









