బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ..
- August 26, 2016
బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థానం (సమాధి)వరకూ మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 2012లో దర్గా ట్రస్టు విధించిన నిషేధంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)మీద ఆదేశాలిచ్చింది. 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' (బీఎంఎంఏ) స్వచ్ఛంద సంస్థ తరఫున ఇద్దరు మహిళలు జకియా సోమన్, నూర్జహాన్ నియాజ్ ఈ పిల్ను దాఖలు చేశారు. బహిరంగ ప్రార్థన ప్రదేశంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు దర్గా ట్రస్టుకు లేదని జస్టిస్ వి.ఎం.కానడే, జస్టిస్ రేవతి మోహితే దేరేల ధర్మాసనం పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







