మ హాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై సునీల్ చిత్రం
- August 26, 2016
మ హాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై సునీల్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతోంది. మలయాళంలో విజయవంతమైన 'టు కంట్రీస్'కి రీమేక్గా ఎన్.శంకర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డి, టీన్యూస్ ఎండీ సంతోష్కుమార్, తెదేపా నాయకుడు పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సునీల్ మాట్లాడుతూ ''నా శైలికి తగ్గ కథ ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. మలయాళంలో దిలీప్ తెరకెక్కించిన సినిమాలు చాలావరకు తెలుగులో విజయవంతంగా రీమేక్ అయ్యాయి.శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరికీ వినోదాన్ని పంచుతుంది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''వినోదంతో పాటు అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన చిత్రం 'టు కంట్రీస్'. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో సాగుతుంది. మలయాళంలో రూ.55 కోట్లు వసూలు చేసిన అలాంటి ఓ మంచి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడం ఆనందంగా ఉంది.ఇందులోని పాత్రని సునీల్ తప్ప మరెవ్వరూ చేయలేరేమో అనిపించింది. మాతృకకి సంగీతం అందించిన గోపీసుందర్ తెలుగులోనూ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు చిత్రీకరణ జరుపుతామ''న్నారు. గోపీసుందర్ మాట్లాడుతూ ''మలయాళంలో చేసిన 'టు కంట్రీస్' సినిమా సంగీత దర్శకుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది.ఆ చిత్రానికి తెలుగులోనూ పనిచేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం సరికొత్త ట్యూన్లు జోడించబోతున్నా'' అన్నారు. శ్రీధర్ సీపాన మాట్లాడుతూ ''పూలరంగడు', 'భీమవరం బుల్లోడు' తర్వాత సునీల్తో మరో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది'' అన్నారు. కార్యక్రమంలో బి.గోపాల్, క్రాంతిమాధవ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, కె.అచ్చిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రాజా రవీంద్ర, టీన్యూస్ సీఈవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









