గాయపడ్డ ఒమనీలకు రెడ్ క్రిసెంట్ వైద్య సహాయం
- August 26, 2016
యెమెన్లో జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ 1500 మందికి వైద్య సహాయం అందించేందుకు రెడ్ క్రిసెంట్ వైద్య సహాయం అందించనుంది. యూఏఈ, సుడాన్ మరియు ఇండియాల్లోని ఆసుపత్రుల ద్వారా వారికి వైద్య సహాయం అందించనున్నట్లు ఎమిరేట్స్ రెడ్ క్రిసెంట్ (ఇఆర్సి) వెల్లడించింది. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనలతో ఈ చర్యలు చేపట్టినట్లు ఇఆర్సి మీడియా సమావేశంలో తెలిపింది. యెమెన్ సహకారంతో అక్కడ గాయపడ్డవారిని 'ఎయిర్ లిఫ్ట్' చేసి, వారికి వైద్య సహాయం అందించనున్నారు. అత్యవసర వైద్య సహాయం కోసం 50 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసి, యూఏఈ ఆసుపత్రులకు తరలిస్తామని ఈ సందర్భంగా ఇఆర్సి వెల్లడించింది. గాయపడ్డవారు ప్రస్తుతం యెమెన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారికి సహాయకులుగా ఉండేవారి ఖర్చుల్ని సైతం తాము భరించనున్నట్లు ఇఆర్సి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







