గాయపడ్డ ఒమనీలకు రెడ్‌ క్రిసెంట్‌ వైద్య సహాయం

- August 26, 2016 , by Maagulf
గాయపడ్డ ఒమనీలకు రెడ్‌ క్రిసెంట్‌ వైద్య సహాయం

యెమెన్‌లో జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ 1500 మందికి వైద్య సహాయం అందించేందుకు రెడ్‌ క్రిసెంట్‌ వైద్య సహాయం అందించనుంది. యూఏఈ, సుడాన్‌ మరియు ఇండియాల్లోని ఆసుపత్రుల ద్వారా వారికి వైద్య సహాయం అందించనున్నట్లు ఎమిరేట్స్‌ రెడ్‌ క్రిసెంట్‌ (ఇఆర్‌సి) వెల్లడించింది. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ సూచనలతో ఈ చర్యలు చేపట్టినట్లు ఇఆర్‌సి మీడియా సమావేశంలో తెలిపింది. యెమెన్‌ సహకారంతో అక్కడ గాయపడ్డవారిని 'ఎయిర్‌ లిఫ్ట్‌' చేసి, వారికి వైద్య సహాయం అందించనున్నారు. అత్యవసర వైద్య సహాయం కోసం 50 మందిని ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి, యూఏఈ ఆసుపత్రులకు తరలిస్తామని ఈ సందర్భంగా ఇఆర్‌సి వెల్లడించింది. గాయపడ్డవారు ప్రస్తుతం యెమెన్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డవారికి సహాయకులుగా ఉండేవారి ఖర్చుల్ని సైతం తాము భరించనున్నట్లు ఇఆర్‌సి స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com