స్మార్ట్‌ డివైజెస్‌పై డిహెచ్‌ఎ హెచ్చరికలు

- August 26, 2016 , by Maagulf
స్మార్ట్‌ డివైజెస్‌పై డిహెచ్‌ఎ హెచ్చరికలు

దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ (డిహెచ్‌ఎ), స్మార్ట్‌ డివైజెస్‌ వినియోగదారులకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేసింది. స్మార్ట్‌ డివైజెస్‌ వాడకంతో కంటి సమస్యలు తలెత్తుతున్నట్లు డిహెచ్‌ఎ తెలిపింది. చాలా ఎక్కువగా స్మార్ట్‌ డివైజెస్‌కి అడిక్ట్‌ అయితే శాశ్వతంగా బ్లైండ్‌నెస్‌ కూడా వచ్చే అవకాశం ఉందని డిహెచ్‌ఎ వర్గాలు హెచ్చరించాయి. దుబాయ్‌ హాస్పిటల్‌కి చెందిన కంటి వైద్య నిపుణుడు (ఆప్తాల్మలజిస్ట్‌) డాక్టర్‌ తాఫిక్‌ అన హకిమ్‌ మాట్లాడుతూ, పలు రకాలైన కంటి సమస్యలతో తమ వద్దకు స్మార్ట్‌ డివైజెస్‌ వినియోగదారులు వస్తున్నారనీ, వారిలో మయోఫియా, గ్లకోమా, కాటరాక్ట్‌, స్ట్రాబిస్మస్‌, అంబ్లియోపియా, కెరాటోకోనస్‌ తదితర సమస్యలతో బాధపడుతున్నవారే ఎక్కువగా వారిలో ఉంటున్నారని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిదేళ్ళ మధ్య వయసు చిన్నారులకు తప్పనిసరిగా కంటి వైద్య పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు. డిహెచ్‌ఎ ఆధ్వర్యంలో స్మార్ట్‌ క్లీనిక్‌, అన్ని వయసుల వారికీ కంటి వైద్యం విషయంలో అనేక వైద్య సేవల్ని అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com