బ్రిటన్‌కు ఐసిస్‌ నుంచి భారీ ముప్పు - నిఘావర్గాలు

- August 27, 2016 , by Maagulf
బ్రిటన్‌కు ఐసిస్‌ నుంచి భారీ ముప్పు - నిఘావర్గాలు

బ్రిటన్‌కు ఐసిస్‌ నుంచి భారీ ముప్పు పొంచిఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. భారీగా నకిలీ పాస్‌ పోర్టులు వినియోగిస్తున్న విషయాన్ని గుర్తించిన తర్వాత ఈ హెచ్చరికలు విడుదలయ్యాయి. ఇటీవల గ్రీస్‌లోని ఓ శరణార్థి శిబిరంలో ఐసిస్‌ మనుషులు నకిలీ పాస్‌పోర్టులు పంచుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఇక్కడ ఉగ్రవాదులు ఐరోపా మొత్తం సంచరించే అవకాశం కలుగుతుంది.
దీనిపై యూరోపోల్‌ డైరెక్టర్‌ రాబ్‌ వాన్‌రైట్‌ మాట్లాడుతూ ఐసిస్‌ సంస్థ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. నిర్ణీత లక్ష్యాలపై దాడులు నిర్వహించేందుకు బృందాలను పంపిస్తోంది. దీంతో అక్కడ జరిగే యుద్ధంపై నుంచి ప్రపంచం దృష్టి మళ్లించవచ్చనేది దాని వ్యూహం.
దీనిలో భాగంగా శరణార్థుల రూపంలో కొందరు యూరోప్‌లోకి చొరబడ్డారని చెప్పారు. నవంబర్లో పారిస్‌ దాడిలో పాల్గొన్న వారు కూడా సిరియాకు చెందిన నకిలీ పాస్‌పోర్టులు వినియోగించారన్నారు. పారిస్‌ తరహా దాడులు జరిగే ప్రమాదం ఉండటంతో దాదాపు 50 బృందాలు ఇప్పటికే సిద్ధంగా పెట్టినట్లు వాన్‌రైట్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com