22 మంది పార్లమెంట్ సభ్యులను నియమించిన పాక్
- August 27, 2016
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 22 మంది పార్లమెంట్ సభ్యులను నియమించారు. ఆక్రమిత కశ్మీర్లో భారత అకృత్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు తదితర సమస్యలను ప్రత్యేక రాయబారులుగా వీరు ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తారని షరీఫ్ చెప్పారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్ కోసం పోరాటం చేసేందుకు వీరిని పంపించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
'ప్రత్యేక రాయబారులైన ఈ బృందానికి పాక్ ప్రజల బలంతోపాటు నియంత్రణ రేఖ వెంబడి కశ్మీరీ ప్రజల ప్రార్థనలు, ప్రభుత్వ మద్దతు ఉంటుంది.
ఈ బృందం వెనుక నేను ఉండి కశ్మీర్ కోసం వారు చేస్తున్న కృషిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేస్తాను. ఈ సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితిలో నా ప్రసంగంలో వీటిని ప్రస్తావిస్తాను' అని షరీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







