డెన్మార్క్ రాజధాని కొపెన్హేగెన్ నగరంలో మహిళల మసీదు ప్రారంభం..
- August 28, 2016
డెన్మార్క్ రాజధాని కొపెన్హేగెన్ నగరంలో ముస్లిం మహిళలు ప్రార్థన (నమాజ్) నిర్వహించుకునేందు కోసం ఓ మసీదును నిర్మించుకున్నారు. కాగా, ఆ మసీదులో అజా ( నమాజుకు రమ్మని పిలుపునివ్వడం )తో పాటు ఖుద్బా ( ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఇచ్చే ప్రసంగం ) ఇచ్చే మౌజన్, ఇమామ్లు కూడా మహిళలు కావడం విశేషం. శుక్రవారం ఇమామ్ షెరీన్ ఖాన్కన్ అజా ఇచ్చి మసీదును ప్రారంభిం చారు. అనంతరం సహచర ఇమామ్ సాలిహా మారీ ఫెత్తేV్ా ప్రసంగించారు. 'ఆధునిక ప్రపంచంలో స్త్రీలు- ఇస్లాం మతం' అంశంపై మాట్లాడారు. పురుషాధిక్యత ఇస్లాం మతంలో ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. ఆధునిక సమాజంలోనూ స్త్రీలు వివక్షకు గురవుతున్నారన్నారు.
ఖురాన్ బోధనలు అనుసరించడంతో పాటు ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ముస్లింలందరూ జీవన విధానాలను మలుచుకోవాలన్నారు. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో ఇస్లామోఫోబియో ( ఇస్లాం మతం పట్ల విద్వేష భావాలు ) పలు దేశాలను పట్టిపీడిస్తోందని అన్నారు. ఇది సభ్య సమాజానికి గొడ్డలిపెట్టువంటిదని చెప్పారు. ఇస్లాం మతం శాంతికి ప్రతీక అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







