డెన్మార్క్ రాజధాని కొపెన్హేగెన్ నగరంలో మహిళల మసీదు ప్రారంభం..
- August 28, 2016
డెన్మార్క్ రాజధాని కొపెన్హేగెన్ నగరంలో ముస్లిం మహిళలు ప్రార్థన (నమాజ్) నిర్వహించుకునేందు కోసం ఓ మసీదును నిర్మించుకున్నారు. కాగా, ఆ మసీదులో అజా ( నమాజుకు రమ్మని పిలుపునివ్వడం )తో పాటు ఖుద్బా ( ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఇచ్చే ప్రసంగం ) ఇచ్చే మౌజన్, ఇమామ్లు కూడా మహిళలు కావడం విశేషం. శుక్రవారం ఇమామ్ షెరీన్ ఖాన్కన్ అజా ఇచ్చి మసీదును ప్రారంభిం చారు. అనంతరం సహచర ఇమామ్ సాలిహా మారీ ఫెత్తేV్ా ప్రసంగించారు. 'ఆధునిక ప్రపంచంలో స్త్రీలు- ఇస్లాం మతం' అంశంపై మాట్లాడారు. పురుషాధిక్యత ఇస్లాం మతంలో ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. ఆధునిక సమాజంలోనూ స్త్రీలు వివక్షకు గురవుతున్నారన్నారు.
ఖురాన్ బోధనలు అనుసరించడంతో పాటు ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ముస్లింలందరూ జీవన విధానాలను మలుచుకోవాలన్నారు. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో ఇస్లామోఫోబియో ( ఇస్లాం మతం పట్ల విద్వేష భావాలు ) పలు దేశాలను పట్టిపీడిస్తోందని అన్నారు. ఇది సభ్య సమాజానికి గొడ్డలిపెట్టువంటిదని చెప్పారు. ఇస్లాం మతం శాంతికి ప్రతీక అన్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









