డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హేగెన్‌ నగరంలో మహిళల మసీదు ప్రారంభం..

- August 28, 2016 , by Maagulf
డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హేగెన్‌ నగరంలో  మహిళల మసీదు ప్రారంభం..

డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హేగెన్‌ నగరంలో ముస్లిం మహిళలు ప్రార్థన (నమాజ్‌) నిర్వహించుకునేందు కోసం ఓ మసీదును నిర్మించుకున్నారు. కాగా, ఆ మసీదులో అజా ( నమాజుకు రమ్మని పిలుపునివ్వడం )తో పాటు ఖుద్బా ( ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఇచ్చే ప్రసంగం ) ఇచ్చే మౌజన్‌, ఇమామ్‌లు కూడా మహిళలు కావడం విశేషం. శుక్రవారం ఇమామ్‌ షెరీన్‌ ఖాన్‌కన్‌ అజా ఇచ్చి మసీదును ప్రారంభిం చారు. అనంతరం సహచర ఇమామ్‌ సాలిహా మారీ ఫెత్తేV్‌ా ప్రసంగించారు. 'ఆధునిక ప్రపంచంలో స్త్రీలు- ఇస్లాం మతం' అంశంపై మాట్లాడారు. పురుషాధిక్యత ఇస్లాం మతంలో ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. ఆధునిక సమాజంలోనూ స్త్రీలు వివక్షకు గురవుతున్నారన్నారు.

ఖురాన్‌ బోధనలు అనుసరించడంతో పాటు ఇస్లాం మత సంప్రదాయం ప్రకారం ముస్లింలందరూ జీవన విధానాలను మలుచుకోవాలన్నారు. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో ఇస్లామోఫోబియో ( ఇస్లాం మతం పట్ల విద్వేష భావాలు ) పలు దేశాలను పట్టిపీడిస్తోందని అన్నారు. ఇది సభ్య సమాజానికి గొడ్డలిపెట్టువంటిదని చెప్పారు. ఇస్లాం మతం శాంతికి ప్రతీక అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com