బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ విచ్చేశారు..

- August 27, 2016 , by Maagulf
బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ విచ్చేశారు..

క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, సాక్షిమాలిక్‌, దీపాకర్మాకర్‌, కోచ్‌ గోపీచంద్‌లకు ఆయన బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు ఆయన హైదరాబాద్ విచ్చేశారు. వాస్తవానికి ఒలింపిక్స్‌లో సింధు పతకం తెస్తే కారు గిఫ్ట్‌గా ఇస్తామని తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్‌ హామీ ఇచ్చారు. అయితే... ప్రస్తుతం పతకాలు సాధించిన ముగ్గురికి, కోచ్ గోపీచంద్‌లకు కూడా ఆయన కార్లను ప్రకటించారు. వాటిని ఆదివారం సచిన్ చేతులమీదుగా ఒలింపియన్లకు అందివ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com