ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు..
- August 28, 2016
మిడియా రధసారథి ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అనితర సాధ్యమైన విజయాలు నమోదు చేసిన ధోనీ జట్టు నాయకుడిగా ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అమెరికాలో భారత్ ఆడిన తొలి క్రికెట్ మ్యాచ్తోనే అది సాధ్యమైంది. ఆ మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన కెప్టెన్గా ధోనీ రికార్డ్ నమోదు చేశాడు. శనివారం జరిగిన టీ20తో మొత్తం 325 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్గా ధోనిదే ఉత్తమ రికార్డు. మహీ తర్వాత ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 324 మ్యాచ్లకు సారథ్యం వహించి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.ఐసీసీ నిర్వహించే అన్ని ప్రపంచ స్థాయి టోర్నీల్లో కప్ అందుకున్న ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. వన్డే, టీ20 వరల్డ్ కప్లతో పాటు, ఛాంపియన్ ట్రోఫీలోనూ భారత్కు కప్ అందించాడు. 71 టీ20 మ్యాచ్లకు సారథ్యం వహించి ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన వికెట్ కీపర్గా కూడా రికార్డ్ నమోదు చేశాడు ధోనీ.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









