ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు..
- August 28, 2016
మిడియా రధసారథి ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అనితర సాధ్యమైన విజయాలు నమోదు చేసిన ధోనీ జట్టు నాయకుడిగా ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అమెరికాలో భారత్ ఆడిన తొలి క్రికెట్ మ్యాచ్తోనే అది సాధ్యమైంది. ఆ మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యధిక మ్యాచ్లకు సారథ్యం వహించిన కెప్టెన్గా ధోనీ రికార్డ్ నమోదు చేశాడు. శనివారం జరిగిన టీ20తో మొత్తం 325 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్గా ధోనిదే ఉత్తమ రికార్డు. మహీ తర్వాత ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 324 మ్యాచ్లకు సారథ్యం వహించి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు.ఐసీసీ నిర్వహించే అన్ని ప్రపంచ స్థాయి టోర్నీల్లో కప్ అందుకున్న ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. వన్డే, టీ20 వరల్డ్ కప్లతో పాటు, ఛాంపియన్ ట్రోఫీలోనూ భారత్కు కప్ అందించాడు. 71 టీ20 మ్యాచ్లకు సారథ్యం వహించి ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన వికెట్ కీపర్గా కూడా రికార్డ్ నమోదు చేశాడు ధోనీ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







