యూత్ఫుల్గా `బలపం పట్టి భామ ఒడిలో`
- August 28, 2016
రష్మీగౌతమ్, శాంతన్ జంటగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో `బలపం పట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాదమైంది. `అ ఆ ఇ ఈ` అనేది ఉపశీర్షిక. దుర్గం గిరీష్ బాబు సమర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ గజగౌని నిర్మాత. ఎ.సి.ముగిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ``కథ చాలా యూత్ఫుల్గా సాగుతుంది. యువతకు నచ్చేలా భారతీబాబు మంచి డైలాగులు రాశారు. రష్మీ గౌతమ్కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ అలరిస్తుంది. అనువాద పనులు పూర్తయ్యాయి. విజయ్ ఎబింజర్ సంగీతం ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ ఎబింజర్, రచన: భారతీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కరణ మల్తుమ్కర్, సహ నిర్మాత: కె.మాధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.నాగరాజ్ గైడ్, రమేష్ కైగూరి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









