యూత్ఫుల్గా `బలపం పట్టి భామ ఒడిలో`
- August 28, 2016
రష్మీగౌతమ్, శాంతన్ జంటగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో `బలపం పట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాదమైంది. `అ ఆ ఇ ఈ` అనేది ఉపశీర్షిక. దుర్గం గిరీష్ బాబు సమర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ గజగౌని నిర్మాత. ఎ.సి.ముగిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ``కథ చాలా యూత్ఫుల్గా సాగుతుంది. యువతకు నచ్చేలా భారతీబాబు మంచి డైలాగులు రాశారు. రష్మీ గౌతమ్కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ అలరిస్తుంది. అనువాద పనులు పూర్తయ్యాయి. విజయ్ ఎబింజర్ సంగీతం ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ ఎబింజర్, రచన: భారతీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కరణ మల్తుమ్కర్, సహ నిర్మాత: కె.మాధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.నాగరాజ్ గైడ్, రమేష్ కైగూరి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







