యూత్ఫుల్గా `బలపం పట్టి భామ ఒడిలో`
- August 28, 2016
రష్మీగౌతమ్, శాంతన్ జంటగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో `బలపం పట్టి భామ ఒడిలో` అనే పేరుతో అనువాదమైంది. `అ ఆ ఇ ఈ` అనేది ఉపశీర్షిక. దుర్గం గిరీష్ బాబు సమర్పిస్తున్నారు. నాగహృషీ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. సంతానం, ఆశిష్ విద్యార్థి, విజయ్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ గజగౌని నిర్మాత. ఎ.సి.ముగిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ``కథ చాలా యూత్ఫుల్గా సాగుతుంది. యువతకు నచ్చేలా భారతీబాబు మంచి డైలాగులు రాశారు. రష్మీ గౌతమ్కి తెలుగులో ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటన అందరినీ అలరిస్తుంది. అనువాద పనులు పూర్తయ్యాయి. విజయ్ ఎబింజర్ సంగీతం ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: విజయ్ ఎబింజర్, రచన: భారతీబాబు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: కరణ మల్తుమ్కర్, సహ నిర్మాత: కె.మాధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.నాగరాజ్ గైడ్, రమేష్ కైగూరి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









