ప్రభుత్వ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసిన షేక్ మహమ్మద్

- August 29, 2016 , by Maagulf
ప్రభుత్వ అధికారులను  ఆశ్చర్యానికి గురిచేసిన  షేక్ మహమ్మద్

యు ఏ ఇ  వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధానమంత్రి,  దుబాయ్ యొక్క పాలకుడు  శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం  ఆదివారం తెల్లవారుజామున ప్రభుత్వ శాఖలు ఆకస్మికంగా  సందర్శించారు.ఆయన సందర్శనల జరిపిన వాటిలో  దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ భూముల శాఖ, మరియు ఆర్ధిక అభివృద్ధి శాఖ (డి ఇ డి ) మరియు దుబాయ్ విమానాశ్రయాలు ఉన్నాయి.ఆయా శాఖల డైరెక్టర్లు మరియు సీనియర్ అధికారులు లేకపోవడం చూసి  షేక్ మహ్మద్ ఆశ్చర్య పోయారు. ఆయన  సందర్శించే  సమయంలో ఏ ఒక్కరు లేరని  ప్రోటోకాల్ శాఖ డైరెక్టర్ ఖలీఫా సయీద్ సల్మాన్, సోషల్ మీడియాలో  ఆశ్చర్యకరంగా చెప్పారు. సోషల్ మీడియా వినియోగదారులు  షేక్ మహమ్మద్ చర్యకు  ప్రశంసించారు.  "ఈ చర్య ద్వారా సీనియర్లు లేదా జూనియర్లు అనే తేడాలు చూపే  అధికారులకు ఇది  ఒక సందేశం. వారు సరైన సమయంకు  విధులకు హాజరుకావాల్సి ఉంటుందని అన్నారు. ఆమె ట్విట్టర్ లో తన పేజీలో  రచయిత మైసా రషీద్ షేక్ మహ్మద్ తన భావాలను వ్యక్తపరుస్తూ  సందర్శన ఏ సీనియర్ అధికారి లేదా డైరెక్టర్ విధి కోసం వెళ్లేముందు  ఆయా కార్యాలయాలలో  ప్రారంభ నివేదిక ఇవ్వాల్సి ఉందని ఇందులో ఎవర్నిమినహాయించేధీ ఏమిలేదని  హామీ ఇస్తున్నట్లుగా ఉందని తెలిపారు.వారు ప్రతికూల విషయాలను  తెలుసుకుంటారు నిజమైన అనుకూల పరిపాలనకు  ఆవిష్కరణ జరుగుతుందని ఆమె  చెప్పారు. దుబాయ్ లో సంస్థలు మరియు విభాగాలు యొక్క కీర్తి మరియు మొత్తం ప్రతికూలతలు మాత్రమే ప్రతిభింభించడం కాదు.. దేశంలో విజయవంతమైన నిర్వహణ పారదర్శకత, జవాబుదారీతనం ప్రస్తతం అవసరం అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com