మానవత్వం చూపించిన బహ్రెయిన్ ప్రధాని
- August 29, 2016
భుజాన భార్య మృతదేహాన్ని మోస్తూ, కూతురితో కలిసి 10 కిలోమీటర్లు నడిచిన భర్త ఘటన యావత్ భారతాన్ని కలిచివేసింది. ఓ పేద వ్యక్తి నిస్సహాయ స్థితికి అద్దం పట్టిన ఆ ఘటన చూసి బహ్రెయిన్ ప్రధాని సైతం చలించిపోయారు. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
మీడియాలో ప్రసారమైన ఆ ఘటన చూసి బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుని, వారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రధాని ఖలీఫా ప్రకటించినట్లు బహ్రెయిన్లోని భారత ఎంబసీ తెలిపింది. అయితే ఎంత సాయం అందిస్తారు, ఎప్పుడిస్తారన్న దానిపై తమకింకా సమాచారం రాలేదని పేర్కొంది.ఆ మొత్తాన్ని దిల్లీలోని బహ్రెయిన్ ఎంబసీ ద్వారా అందిస్తారు.
అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన దన మాంజీ.. తన భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్లు కాలినడకన తీసుకెళ్లిన వార్త, ఫొటోలను చూసి యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







