నాగ్ స్టాంప్ విడుదల
- August 29, 2016
అక్కినేని నాగార్జున పుట్టినరోజున ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్.. నాగార్జున, తాజ్మహల్ బొమ్మలతో ఉన్న ఐదు రూపాయల ప్రైవేటు పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్మలా కాన్వెంట్ చిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. నాగచైతన్య ఈ స్టాంపును అఖిల భారత నాగార్జున అభిమానుల సంఘం ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావుకు అందించారు. అఖిల్ అఖిల భారత నాగార్జున అభిమానుల సంఘం తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రవీంద్రరెడ్డికి అందించారు. మొత్తం 10 వేల స్టాంపులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. 'నా వయసులో నేనేం చేయాలో అవన్నీ ఈ వయసులో నాన్న చేసి చూపిస్తున్నారు. గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, సోగ్గాడే చిన్నినాయనా ఇలా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. ఆయన మాకు ప్రేరణగా నిలుస్తున్నారు' అన్నారు.
అనంతరం అఖిల్ మాట్లాడారు. 'నాన్న మాకెప్పుడూ ఆదర్శమే. మేము ఆయన బాటలో నడిచి, అభిమానుల ఆదరణ పొందాలి' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







