నాగ్ స్టాంప్ విడుదల
- August 29, 2016అక్కినేని నాగార్జున పుట్టినరోజున ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్.. నాగార్జున, తాజ్మహల్ బొమ్మలతో ఉన్న ఐదు రూపాయల ప్రైవేటు పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్మలా కాన్వెంట్ చిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని విడుదల చేశారు. నాగచైతన్య ఈ స్టాంపును అఖిల భారత నాగార్జున అభిమానుల సంఘం ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావుకు అందించారు. అఖిల్ అఖిల భారత నాగార్జున అభిమానుల సంఘం తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు పి. రవీంద్రరెడ్డికి అందించారు. మొత్తం 10 వేల స్టాంపులను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. 'నా వయసులో నేనేం చేయాలో అవన్నీ ఈ వయసులో నాన్న చేసి చూపిస్తున్నారు. గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, సోగ్గాడే చిన్నినాయనా ఇలా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. ఆయన మాకు ప్రేరణగా నిలుస్తున్నారు' అన్నారు.
అనంతరం అఖిల్ మాట్లాడారు. 'నాన్న మాకెప్పుడూ ఆదర్శమే. మేము ఆయన బాటలో నడిచి, అభిమానుల ఆదరణ పొందాలి' అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన