కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద పేలుడు

- August 30, 2016 , by Maagulf
కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద పేలుడు

కిర్గిస్థాన్‌లోని చైనా దౌత్యకార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కారు బాంబు పేలుడు సంభవించింది. పేలుడుకు ముందు ఎంబసీ గేట్‌ లోపలికి కారు వేగంగా దూసుకొచ్చినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ మృతి చెందగా.. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. పోలీసులు, భద్రతాసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com