ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్!
- August 30, 2016
ఒలింపిక్ గోల్డ్ మెడల్ పోయిందని బాధపడుతున్న ఆమెరికా అథ్లెట్ చెంతకు పతకం చేరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 1992లో బార్సిలోనాలో జరిగిన ఒలింపిక్స్ లో రోయింగ్ విభాగంలో జో జాకోబి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే మాజీ ఒలింపియన్ జో జాకోబి గత జూన్ లో తన పతకం పోయిందని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తన కారులో నుంచి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని పతకాన్ని ఎవరో చోరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంతో అందరికీ ఆ విషయం తెలిసిపోయింది. ఇది జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత తండ్రితో కలిసి వెళ్తుండగా ఏడేళ్ల అట్లాంటా చిన్నారి కోల్ స్మిత్ ఓ చెత్తకుండీలో స్వర్ణ పతకాన్ని గుర్తించింది.
ఈ పతకం జకోబి పతకం అని తండ్రీకూతుళ్లు నిర్ధారించుకున్నారు. అతడికి పతకాన్ని అందేలా చేశారు. చిన్నారి కోల్ స్మిత్ గురించి తెలుసుకుని ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి ప్రత్యేకంగా ఆమెను అభినందించాడు. దీంతో ఆ స్కూలు యాజమాన్యంతో పాటు చిన్నారి స్నేహితులకు ఆమె చేసిన గొప్పపని గురించి తెలిసింది. చిన్నారి కోల్ స్మిత్ కూడా స్వర్ణ పతకాన్ని చేతిలోకి తీసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సందర్భంగా మళ్లీ తన వద్దకు చేరిన మెడల్ ను స్కూలు విద్యార్థులకు చూపించాడు. గొప్ప అథ్లెట్ తమ స్కూలుకు రావడంతో యాజయాన్యంతో పాటు విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







