దోహా ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ ట్యాక్స్
- August 30, 2016
ఖతార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక నుంచి ప్యాసింజర్ ట్యాక్స్ని ప్రయాణీకులకు విదించనున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి ఎయిర్పోర్ట్ వర్గాలు. ఈ వారంలో 35 రియాల్స్ (10 డాలర్లు) లెవీగా అమల్లోకి తీసుకొస్తామని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (హెచ్ఐఎ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎయిర్లైన్ టిక్కెట్ ధరలతోపాటు ఈ పన్ను మొత్తాన్ని వసూలు చేస్తారు. ఆగస్ట్ 30 నుంచి జారీ అయ్యే టిక్కెట్లు అలాగే, డిసెంబర్ 1 తర్వాత ప్రయాణించేవారిపై ఈ పన్నును విదించనున్నారు. దోహా ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఏడాది తొలి క్వార్టర్లో 9 మిలియన్ ప్యాసింజర్లు ప్రయాణం సాగించారు. 2022 ఫుట్ బాల్ వరల్డ్ కప్ని నిర్వహించనున్న ఖతార్, తొలిసారిగా 15 ఏళ్ళ తర్వాత బడ్జెట్ డెఫిసిట్లో పడింది. సుమారు 12 బిలియన్ డాలర్ల డెఫిసిట్లో ఉన్నట్లుగా గుర్తించారు. 2017, 2018లో కూడా బడ్జెట్ డెఫిసిట్ తప్పకపోవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







