లేబర్ సిటీ సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి
- August 31, 2016
అష్గల్, కొత్త పంపింగ్ స్టేషన్, ట్రీటెడ్ సీవేజ్ ఎఫ్లుయెంట్ (టిఎస్ఇ) ప్లాంట్ పనుల్ని మెసైమీర్లోని లేబర్ సిటీలో పూర్తి చేసింది. ఈ పనులతో మొత్తం 75,000 మంది కార్మికులకు ఉపయోగకరంగా ఉండనుంది. వీరందరికీ రానున్న రోజుల్లో అకామడేషన్ కోసం ఏర్పాట్లు చేసినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. పంపింగ్ స్టేషన్ నిర్మాణం, రిహాబిలిటేషన్ ప్రాజెక్టులు, 27 పంప్ స్టేషన్ల నిర్మాణం అలాగే అభివృద్ధి, 18 రైజింగ్ మెయిన్స్ని దోహా, అల్ వక్రా, అల్ రయ్యాన్, సాలియా వంటి ప్రాంతాల్లో విస్తరించడం ఐదున్నరేళ్ళలోపు పూర్తవుతుంది. లేబర్ సిటీ కొత్త నిర్మాణాల కోసం మొత్తంగా 61.8 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చవుతోంది. మల్టీ ఫేస్ పంప్ స్టేషన్నిర్మాణం మరియు అప్గ్రేడేషన్ కోసం 1.1 మిలియన్ ఖతారీ రియాల్స్ ఖర్చవుతుంది. సెకెనుకు 417 లీటర్ల కెపాసిటీతో లేబర్ సిటీలోని ఇండస్ట్రియల్ ట్రీట్మెంట్ప్లాంట్ని పూర్తి చేశారు. 3 కిలోమీటర్ల మేర టిఎస్ఇ లైన్ని నిర్మించి, దాని ద్వారా లేబర్ సిటీ లాండ్ స్కేప్ కోసం పాగునీటిని సరఫరా చేస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







