ఆన్‌లైన్‌ బిజినెస్‌లో 0.5 మిలియన్లు కోల్పోయిన దుబాయ్‌ మహిళ

- August 31, 2016 , by Maagulf
ఆన్‌లైన్‌ బిజినెస్‌లో 0.5 మిలియన్లు కోల్పోయిన దుబాయ్‌ మహిళ

సోషల్‌ మీడియా ద్వారా వచ్చిన ఓ ఫేక్‌ ఆఫర్‌ కారణంగా దుబాయ్‌కి చెందిన ఓ మహిళ 500,000 దిర్హామ్‌లు నష్టపోయారు. రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేయవచ్చని ఆ ఫేక్‌ ఆఫర్‌ ద్వారా దుబాయ్‌ మహిళను కొందరు తప్పుదోవ పట్టించారు. అత్యాశకు పోయిన ఆ మహిళ, ఇప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. 10,000 దిర్హామ్‌ల నుంచి 280,000 దిర్హామ్‌ల వరకు పలు మార్లు బాధిత మహిళ, కొందరు అక్రమార్కులక చెల్లించారు. ఆ తర్వాత అదంతా ఫ్రాడ్‌ అని ఆమె గుర్తించారు. ఆమెకు విషయం అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకో వైపున న్యాయనిపుణుల సూచనలతో ఇరు పార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చి, సెటిల్‌మెంట్‌ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియవస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com